అలా చేసినందుకు సీఎం జగన్‌పై కేసు పెట్టాలి: జీవీ ఆంజనేయులు

ABN , First Publish Date - 2021-05-09T20:48:23+05:30 IST

ప్రజలను కాపాడలేని ప్రభుత్వం, సీఎం జగన్ ప్రతిపక్షనేతపై కేసులు పెట్టడమేంటి? అని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు.

అలా చేసినందుకు సీఎం జగన్‌పై కేసు పెట్టాలి: జీవీ ఆంజనేయులు

విజయవాడ: ప్రజలను కాపాడలేని ప్రభుత్వం, సీఎం జగన్ ప్రతిపక్షనేతపై కేసులు పెట్టడమేంటి? అని  మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  కేసులు పెట్టాల్సి వస్తే నిత్యం వేలాది చావులకు కారకుడైన సీఎంపైనే పెట్టాలని చెప్పారు.  వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నందుకు సీఎం, ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు.  ప్రజలకు జాగ్రత్తలు చెబితే చంద్రబాబుపై కేసులు పెడతారా? అని జీవీ ఆంజనేయులు నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి ప్రజల ప్రాణాలను కాపాడాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-05-09T20:48:23+05:30 IST