మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే దళితున్ని కొట్టి చంపారు: టీడీపీ నేత

ABN , First Publish Date - 2021-12-22T00:38:51+05:30 IST

వైసీపీ నేతల రౌడీయిజం పెరిగిపోయిందని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు తెనాలి శ్రావణ కుమార్ మండిపడ్డారు. ఎవ్వరూ నోరు ఎత్తలేని పరిస్థితి వచ్చిందన్నారు.

మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే దళితున్ని కొట్టి చంపారు: టీడీపీ నేత

గుంటూరు: వైసీపీ నేతల రౌడీయిజం పెరిగిపోయిందని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు తెనాలి శ్రావణ కుమార్ మండిపడ్డారు. ఎవ్వరూ నోరు ఎత్తలేని పరిస్థితి వచ్చిందన్నారు. జగన్ పాలన గురించి మాట్లాడితే వెంకట నారయణ పై దాడి చేసి తగలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే దళితున్ని కొట్టి చంపారని ఆయన ఆరోపించారు. విశాఖకు చెందిన డాక్టర్‌ను పిచ్చోడిని చేశారని మండిపడ్డారు. సలహా ఇచ్చిన స్వంత పార్టీకి చెందిన గుప్తాపై దాడి చేసారని పేర్కొన్నారు. అలాగే హోం మంత్రి సుచరిత నియోజకవర్గం లో దళితుడుపై హత్య యత్నం జరిగిందన్నారు. జగన్ రెడ్డి జన్మదినం రోజే దళితుడుకు బహుమానంగా ఉందన్నారు. 

Updated Date - 2021-12-22T00:38:51+05:30 IST