కోల్డ్స్టోరేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం...మిర్చిరైతులకు తీవ్రనష్టం
ABN , First Publish Date - 2020-05-23T14:06:02+05:30 IST
కోల్డ్స్టోరేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం...మిర్చిరైతులకు తీవ్రనష్టం
గుంటూరు: జిల్లాలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నిర్వాహకంతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత రెండు వారాలుగా స్టోరేజ్లో ఏసీలు పనిచేయని పరిస్థితి నెలకొంది. దీంతో స్టోరేజ్లో రైతులు నిల్వ ఉంచిన మిరపకాయలు బూజుపట్టిపోయాయి. సుమారు 20 వేల క్వింటాలు పంట నష్టం వాటిల్లింది. కాగా దీనిపై రైతులకు యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. స్టోరేజ్ వద్దకు వచ్చి అడిగితే సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించింది. విషయం తెలిసిన వెంటనే రైతులు స్టోరేజ్లోని మిరపకాయలను బయటకు తీసి ఆరబోసుకుంటున్నారు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో టిక్కీకి రూ. 400 అద్దె వసూలు చేశారని రైతులు చెబుతున్నారు. యాజమాన్యం తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.