పొరుగింటి మహిళ ఆమె పెంపుడు కుక్కకు తన భార్య పేరు పెట్టిందని...ఆగ్రహంతో వారేం చేశారంటే...

ABN , First Publish Date - 2021-12-22T14:29:49+05:30 IST

ఓ మహిళ ఆమె పెంపుడు కుక్కకు తన భార్య పేరు పెట్టిందనే ఆగ్రహంతో పొరుగింటి వ్యక్తులు ఆమెపై దాడి చేసి...

పొరుగింటి మహిళ ఆమె పెంపుడు కుక్కకు తన భార్య పేరు పెట్టిందని...ఆగ్రహంతో వారేం చేశారంటే...

అహ్మదాబాద్:ఓ మహిళ ఆమె పెంపుడు కుక్కకు తన భార్య పేరు పెట్టిందనే ఆగ్రహంతో పొరుగింటి వ్యక్తులు ఆమెపై దాడి చేసి కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగుచూసింది. గుజరాత్‌లో ఒకరి భార్య మారుపేరును తన కుక్కపిల్లకు పెట్టడంపై కోపంతో ఆమె పొరుగింటివారు దాడి చేసి మహిళకు నిప్పంటించారు. ఈ ఘటనలో బాధిత మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన భావ్‌నగర్ జిల్లాలోని పాలిటానా పట్టణంలో జరిగింది. బాధితురాలు నీతాబెన్ సర్వయ్య (35)కు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె భావ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పలిటానా టౌన్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఘటనా సమయంలో సర్వయ్య తన చిన్న కొడుకుతో కలిసి ఇంట్లోనే ఉంది. 


ఆమె భర్త, ఇద్దరు పిల్లలు బయటకు వెళ్లారు. సర్వయ్య పొరుగింటి వారు సురభాయ్ భర్వాద్‌తో పాటు మరో ఐదుగురు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ప్రకారం సర్వయ్య తన కుక్కపిల్లకి ‘సోను’ అని పేరు పెట్టడాన్ని పొరుగింటి వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.సర్వయ్య ఉద్ధేశపూర్వకంగా కుక్కపిల్లకి తన భార్య పేరు పెట్టిందని భర్వాద్ ఆరోపించాడని పోలీసులు తెలిపారు. భర్వాద్ తనను దుర్భాషలాడాడని సర్వయ్య పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది.మహిళ సర్వయ్య వంటగదిలోకి రాగానే ముగ్గురు వ్యక్తులు ఆమెను అనుసరించారు. వారిలో ఒకరు సర్వయ్యపై కంటైనర్‌లోని కిరోసిన్‌ పోసి అగ్గిపుల్ల వెలిగించి నిప్పంటించారని పోలీసులు తెలిపారు.హత్యాయత్నం, ఇంట్లోకి అక్రమంగా చొరబడటం, అవమానించడం తదితర నేరాలకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-12-22T14:29:49+05:30 IST