రెమిడెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్న ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2021-05-06T17:25:38+05:30 IST
వరంగల్ : రెమిడెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
వరంగల్ : రెమిడెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కరోనా వ్యాధిగ్రస్తులకు అత్యవసర సమయాల్లో డాక్టర్లు అందించే రెమ్ డెసివర్ ఇంజక్షన్లను ఎంఆర్పీ కన్నా అత్యధిక రెట్లతో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 28 రెమిడెసివర్ ఇంజక్షన్లు, 20వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మనోహర్, కుమారస్వామి, అశోక్ను సీపీ తరుణ్ జోషీ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.