అక్కాచెల్లెళ్లకు వరుడి తాళి!

ABN , First Publish Date - 2021-05-24T09:59:05+05:30 IST

ఆ మండపంలో పెళ్లి కూతుళ్లుగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు! ఆ ఇద్దరి మెడలో ఒకే ముహుర్తానికి తాళి కట్టాడో వ్యక్తి. మెదక్‌ జిల్లా కొల్చారం మండలం హంసాన్‌పల్లిలో ఆదివారం ఈ పెళ్లి జరిగింది.

అక్కాచెల్లెళ్లకు వరుడి తాళి!

  • తొలుత అక్కతో వివాహం నిశ్చయం
  • ఆమె చెల్లికి మానసిక సమస్య.. ఇద్దరితో ఒకేసారి వివాహం

శివ్వంపేట, మే 23: ఆ మండపంలో పెళ్లి కూతుళ్లుగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు! ఆ ఇద్దరి మెడలో ఒకే ముహుర్తానికి తాళి కట్టాడో వ్యక్తి. మెదక్‌ జిల్లా కొల్చారం మండలం హంసాన్‌పల్లిలో ఆదివారం ఈ పెళ్లి జరిగింది. వెంకటేశం దంపతులకు స్వాతి, శ్వేత కూతుళ్లు. పెద్ద కూతురు స్వాతికి శివ్వంపేట మండలం పాంబండ గ్రామానికి చెందిన బాల్‌రాజ్‌తో వివాహం నిశ్చయమైంది. వెంకటేశం చిన్న కూతురు శ్వేతకు మతిస్థిమితం సరిగ్గాలేదు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకురారని తల్లిదండ్రులు భావించారు. దీంతో బాల్‌రాజ్‌, స్వాతి వివాహం అయిన వెంటనే అదే ముహూర్తానికి శ్వేత మెడలోనూ బాల్‌రాజ్‌తోనే తాళి కట్టించారు. స్వాతిని అత్తింటికి పంపుతామని, శ్వేత మాత్రం తమ వద్దే ఉంటుందని కుటుంబ సభ్యులు చెప్పారు.

Updated Date - 2021-05-24T09:59:05+05:30 IST