తెలంగాణ సంపర్క్‌ క్రాంతి మంజూరు చేయండి

ABN , First Publish Date - 2021-12-04T07:40:15+05:30 IST

తెలంగాణ సంపర్క్‌ క్రాంతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌స(హైదరాబాద్‌-డెహ్రాడూన్‌ వయా నిజామాబాద్‌- ఆదిలాబాద్‌- నాగ్‌పూర్‌)ను మంజూరు చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ కోరారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన రైల్వేబోర్డు చైర్మన్‌ రమేశ్‌ చంద్ర రత్నకు ఈ మేరకు వినతిపత్రం అందచేశారు.

తెలంగాణ సంపర్క్‌ క్రాంతి మంజూరు చేయండి

బీజేపీ వినతి

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంపర్క్‌ క్రాంతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌స(హైదరాబాద్‌-డెహ్రాడూన్‌ వయా నిజామాబాద్‌- ఆదిలాబాద్‌- నాగ్‌పూర్‌)ను మంజూరు చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ కోరారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన రైల్వేబోర్డు చైర్మన్‌ రమేశ్‌ చంద్ర రత్నకు ఈ మేరకు వినతిపత్రం అందచేశారు. అలాగే నిజామాబాద్‌-కాజీపేట(వయా పెద్దపల్లి), కరీంనగర్‌-సికింద్రాబాద్‌(వయా పెద్దపల్లి) కొత్త రైళ్లు మంజూరు చేయాలని, తిరుపతి-సికింద్రాబాద్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సను సిర్‌పూర్‌-కాగజ్‌నగర్‌ వరకు, తిరుపతి-కరీంనగర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును బాసర వరకు పొడిగించాలని, దీనికి సరస్వతి ఎక్స్‌ప్రె్‌సగా నామకరణం చేయాలని కోరారు. 

Updated Date - 2021-12-04T07:40:15+05:30 IST