నిందితుడిని మా చేతులతో నరుకుతాం: బాధితురాలి నాన్నమ్మ
ABN , First Publish Date - 2021-09-16T18:01:29+05:30 IST
ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘట్కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్పూర్ మండలం, పామునూరు దగ్గర రాజారాం వంతెన రేల్వే ట్రాక్పై రాజు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన బాధితురాలి నాన్నమ్మ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఎవరు చెప్పిన నమ్మమన్నారు. ‘ఒకవేళ చనిపోతే ఆ మృతదేహాన్ని మా ఇంటికి తీసుకురావాలి.. ఇతనే అని చెబితే మేము గుర్తుపట్టి.. మళ్లి మా చేతితో నరకాలి.. అప్పుడే మాకు శాంతి కలుగుతుందని’ చెప్పింది. చనిపోయిన బాడీని తమకు చూపించాలని, లేకపోతే తాము నమ్మేదిలేదని ఆమె మరోసారి స్పష్టం చేసింది.