పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-07-07T05:58:46+05:30 IST

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న భూసమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలి....

పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలి

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న భూసమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలి. ఎంతో కొంత భూమి ఉన్నప్పటికీ, అవి లేకపోవడంతో వారు రైతుబంధు, రైతుబీమా పథకాలు పొందలేకపోతున్నారు. పాసుపుస్తకాల కోసం మీసేవ, తహశీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం ఉండడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు వివాదాలను, భూములకు సంబంధించన ఇతర ఫిర్యాదులను పార్ట్‌బి పేరుతో పెండింగ్‌లో పెట్టింది. తదుపరి కొన్నింటిని పరిష్కరించి పాసుపుస్తకాలు అందించింది. అయితే మరికొన్నింటి భూములను నేటికీ అలాగే పక్కనే పెట్టింది. దీంతో, ఆయా రైతులకు ప్రభుత్వ పథకాలు అందక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా, రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను సత్వరమే పరిష్కరించి రైతులకు లబ్ధి చేకూరేలా చూడాలి.

శ్రీనివాస్‌ చిరిపోతుల

Updated Date - 2021-07-07T05:58:46+05:30 IST