వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి

ABN , First Publish Date - 2021-09-16T18:04:03+05:30 IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. బాలింత అనూష మృతి చెందింది. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు.

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. బాలింత అనూష మృతి చెందింది. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. పెద్దబొంకూర్‌కు చెందిన అనూషకు ఆపరేషన్ చేస్తున్న క్రమంలో వైద్యులు మత్తు మందు ఇచ్చారు. వైద్యుల నిర్లక్ష్యంగానే అనూష చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సిజేరియన్ ద్వారా వైద్యులు డెలివరీ చేశారు. బాబు క్షేమంగా ఉన్నాడు.


Updated Date - 2021-09-16T18:04:03+05:30 IST