గవర్నర్‌ తమిళిసైను కలిసిన ఐఐఎస్‌ ట్రెయినీ అధికారులు

ABN , First Publish Date - 2021-10-17T22:23:43+05:30 IST

ది ఇండియన్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సర్వీసెస్‌ (ఐఐఎస్‌) ట్రెయినీ అధికారులు ఆదివారం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు.

గవర్నర్‌ తమిళిసైను కలిసిన ఐఐఎస్‌ ట్రెయినీ అధికారులు

హైదరాబాద్‌: ది ఇండియన్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సర్వీసెస్‌ (ఐఐఎస్‌) ట్రెయినీ అధికారులు ఆదివారం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌ఇన్‌ఫర్‌మేషన్‌ బ్యూరో(పిఐబి)కి వారు అటాచ్‌అయిన నేపధ్యంలో వారు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మినిస్ర్టీ ఆఫ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌  ఆధ్వర్యంలో పనిచేసే పిఐబి అధికారులకు గవర్నర్‌ తమిళిసై అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో ఇండియన్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సర్వీసెస్‌నుతమ కేరీర్‌గా ఎంచుకోవడం పట్ల వారిని ప్రశంసించారు.


క్షేత్ర స్థాయిలో ప్రాంతీయ భాషపట్ల సరైన కమ్యూనికేషన్‌ కలిగి వుండడం ఎంతో ముఖ్యమని అన్నారు. తన అనుభవంలోని కొన్ని తమిళ అంశాలను ఆమె వివరించారు. కమ్యూనికేషన్‌ ప్రాముఖ్యతను వివరించారు. యువ అధికారులు అంకిత భావంతో పనిచేస్తూ సమాచార రంగంలో మరింత నైపుణ్యాన్ని సాధించాలని సూచించారు. 

Updated Date - 2021-10-17T22:23:43+05:30 IST