Raghunandan Rao: కేసీఆర్‌కు కరోనా వచ్చిందేమో..!

ABN , First Publish Date - 2022-08-16T03:24:07+05:30 IST

గవర్నర్ తమిళిసై రాజ్ భవన్‌లో నిర్వహించిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాకపోవడాన్ని బీజేపీ నేతలు...

Raghunandan Rao: కేసీఆర్‌కు కరోనా వచ్చిందేమో..!

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై (Governor Tamili sai) రాజ్ భవన్‌లో నిర్వహించిన ‘ఎట్ హోమ్’  కార్యక్రమానికి (At Home Event) సీఎం కేసీఆర్ (Cm Kcr)  హాజరుకాకపోవడాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. తొలుత వస్తానని రాజ్‌భవన్ వర్గాలకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత గైర్హాజరవడంపై సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Bjp Mla Raghunandhan Rao) రాజ్ భవన్‌ (RajBhavan)లో చిట్ చాట్ నిర్వహించారు. గవర్నర్ నిర్వహించిన కార్యక్రమానికి కేసీఆర్ రాకపోవడాన్ని తప్పుబట్టారు.  ‘‘కేసీఆర్‌కు కరోనా వచ్చిందేమో.. అందుకే రాలేదు. 15 రోజులు రెస్ట్ అని చెపుతారు. కలెక్టరేట్ ఓపెనింగ్,  మునుగోడు సభకు వెళ్ళడేమో. కేసీఆర్, కేటీఆర్ మీద ఈడీని ప్రయోగించం. చికోటి కేసులో కొంత మంది ఎమ్మెల్సీలు బయటపడతారు.’’ అని అన్నారు. 


ఇక రాజ్‌భవన్‎లో నిర్వహించిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి టీఆర్ఎస్ నేతలు కూడా వెళ్లలేదు. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, హైదరాబాద్ సీపీ ఆనంద్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాత్రమే హాజరయ్యారు


Updated Date - 2022-08-16T03:24:07+05:30 IST