శ్రీవారి సేవలో గవర్నర్
ABN , First Publish Date - 2022-05-15T08:29:05+05:30 IST
శ్రీవారి సేవలో గవర్నర్
తిరుమల, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ను టీటీడీ ఈవో ధర్మారెడ్డి సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఇస్తికఫాల్తో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన హరిచందన్ ధ్వజస్తంభానికి మొక్కుకున్న తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వదించగా, ఈవో లడ్డూప్రసాదాలు అందజేశారు.