గవర్నర్ ‘ఈద్ మిలాద్-ఉన్-నబీ’ శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2021-10-18T21:17:42+05:30 IST
ఈనెల 19న మహ్మద్ ప్రవక్త జయంతి ‘ ఈద్ మిలాద్-ఉన్-నబీ’ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: ఈనెల 19న మహ్మద్ ప్రవక్త జయంతి ‘ ఈద్ మిలాద్-ఉన్-నబీ’ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యత, మతసామరస్యం, సౌభ్రాతృత్వాన్ని బోధించి మహ్మద్ ప్రవక్తను ఈ సందర్భంగా స్మరించుకోవాలని అన్నారు. నమ్మకం, అంకితభావం, కరుణ, విశ్వాసానికి ప్రతీకగా మహ్మద్ ప్రవక్త బోధనలు చేశారని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా మతసామర్యం, ఐక్యత, శాంతి వంటి వాటిని ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలన్నారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈద్ మిలాద్ ఉన్నబీని జరుపుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.