మధుసూదనాచారికి గవర్నర్ ఆమోదం
ABN , First Publish Date - 2021-11-20T08:55:54+05:30 IST
సిరికొండ మధుసూదనాచారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు.
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సిరికొండ మధుసూదనాచారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. ఆయన పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వం పంపించిన ఫైలుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేసినట్టు టీఆర్ఎస్ ముఖ్యులకు సమాచారం అందింది. అయితే అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.