క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వాలు సహకరించాలి: పుల్లెల గోపీచంద్
ABN , First Publish Date - 2021-12-06T00:39:41+05:30 IST
క్రీడారంగం అభివృద్థికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు.
కోదాడ: క్రీడారంగం అభివృద్థికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు ఒలంపిక్స్ పోటీల్లో బ్యాడ్మింటన్ విభాగంలో దేశానికి మూడు పతకాలు రావడం శుభపరిణామన్నారు. ఒలంపిక్స్ విజేత పీవీ.సింధుకు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. త్వరలో ప్రారంభంకానున్న ఒలింపిక్స్లో రాణించి దేశానికి వన్నె తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ‘ఖేల్ ఇండియా’ ‘ఫిట్ ఇండియా’ వంటి పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం క్రీడారంగాన్ని పోత్సహించడం అభినందనీయమన్నారు. మైదానాల ఏర్పాటుతో పిల్లలలో క్రీడా ఆసక్తి నెలకొంటుందన్నారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాలని గోపీచంద్ సూచించారు.