ఉద్యోగ సంఘాలతో మళ్లీ మొదలైన ప్రభుత్వ చర్చలు

ABN , First Publish Date - 2022-02-05T03:53:17+05:30 IST

ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ చర్చలకు కాసేపు విరామం లభించింది. హెచ్ఆర్ఏ

ఉద్యోగ సంఘాలతో మళ్లీ మొదలైన ప్రభుత్వ చర్చలు

అమరావతి: ఉద్యోగ సంఘాలతో  ప్రభుత్వ చర్చలు మళ్లీ మొదలయ్యాయి. అయితే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ చర్చలకు కాసేపు విరామం లభించింది. హెచ్ఆర్ఏ శ్లాబ్‌లలో మార్పులకు మంత్రులు  అంగీకారం తెలిపారు. అదనపు క్వాంటం పింఛన్‌లో మార్పులకు మంత్రులు అంగీకారం తెలిపారు. సీపీఎస్ రద్దుపై మరో మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోందని కమిటీ తెలిపింది. మరో ఉపసంఘం చర్చల దృష్ట్యా సమయం కావాలని మంత్రుల కమిటీ కోరింది. ప్రభుత్వం సూచించిన అంశాలపై నిర్ణయం తెలపాలని  మంత్రుల కమిటీ కోరింది. చర్చించుకుని చెబుతామని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.  


Updated Date - 2022-02-05T03:53:17+05:30 IST