నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తున్న ప్రభుత్వం: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-05-16T01:44:01+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దుయ్యబట్టారు

నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తున్న ప్రభుత్వం: సోము వీర్రాజు

రాజమహేంద్రవరం: రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలసి అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేదల ఇళ్ల కోసం లక్షా 80 వేలు ఇస్తున్నామని, తాము అధికారంలోకి వస్తే దాదాపుగా ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేయడం తప్ప ఖజానా నింపుకునే పరిస్థితి లేదని తప్పుబట్టారు. ప్రభుత్వం లిక్కర్‌ను ఆదాయ వనరుగా చూస్తోందని, ఇది సరికాదని సోము వీర్రాజు పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-16T01:44:01+05:30 IST