ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎవరూ సరిగా పనిచేయడం లేదు: Vidadala Rajini
ABN , First Publish Date - 2022-06-04T22:19:15+05:30 IST
ప్రభుత్వ ఆస్పత్రులు, సిబ్బంది తీరుపై మంత్రి విడదల రజనీ కీలక (Vidadala Rajini) వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రులు, సిబ్బంది తీరుపై మంత్రి విడదల రజనీ కీలక (Vidadala Rajini) వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో (government hospitals) ఎవరూ సరిగా పనిచేయడం లేదన్నారు. జీజీహెచ్లో సూపరింటెండెంట్ మాటను డాక్టర్స్ వినడం లేదని తెలిపారు. వైద్య సిబ్బంది పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. త్వరలో ఎమ్మెల్యేలందరితో సమీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. పీహెచ్సీల పనితీరు మెరుగుపడాలని విడదల రజినీ పేర్కొన్నారు.