వరద బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిద్రపోతోంది: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-07-14T22:44:48+05:30 IST
వరద బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిద్రపోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.
అమరావతి: వరద బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిద్రపోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విపత్తుల సమయంలో ప్రజలను హెచ్చరించే వ్యవస్థలను.. వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. పాలకుల అలసత్వంతో వరద బాధితులు అల్లాడుతున్నారని తెలిపారు. వరద బాధితులకు అండగా ఉంటూ సాయం చేయాలని టీడీపీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ విమర్శలు మాని ప్రజలు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని చంద్రబాబు ప్రకటించారు.