ఆందోళన వద్దు.. ఆరోగ్యంగానే ఉన్నా: సునీత

ABN , First Publish Date - 2020-07-04T03:35:00+05:30 IST

తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి తెలిపారు. స్వల్ప అస్వస్థతతో ఇబ్బంది పడుతున్న సునీత యశోద

ఆందోళన వద్దు.. ఆరోగ్యంగానే ఉన్నా: సునీత

హైదరాబాద్: తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి తెలిపారు. స్వల్ప అస్వస్థతతో ఇబ్బంది పడుతున్న సునీత యశోద ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమె స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆలేరు నియోజకవర్గం పరిధిలోని ప్రజలు, పార్టీ నాయకులు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. కరోనా ప్రారంభ దశలోనే ఉందని, వైద్యం కొనసాగుతోందని చెప్పారు. ‘‘లక్ష్మీనరసింహ స్వామి దయ, ఆలేరు ప్రజల అభిమానంతో త్వరలోనే కోలుకుని మీ ముందుకు ఆరోగ్యంతో వస్తాను’’ అని సునీత చెప్పారు.

Updated Date - 2020-07-04T03:35:00+05:30 IST