పారుల్, శంకర్లాల్కు స్వర్ణాలు
ABN , First Publish Date - 2021-09-18T07:49:45+05:30 IST
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రైల్వేస్ క్రీడాకారిణి పారుల్ చౌధరి రెండో స్వర్ణ పతకంతో మెరిసింది.
జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్
హనుమకొండ స్పోర్ట్స్: జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రైల్వేస్ క్రీడాకారిణి పారుల్ చౌధరి రెండో స్వర్ణ పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన మహిళల 3 వేల మీటర్ల స్టీపుల్ చేజ్లో పారుల్ (ఉత్తరప్రదేశ్) విజేతగా నిలిచింది. అంతకుముందు 5 వేల మీటర్ల పరుగులో ఆమె పసిడి సాధించింది. కాగా, పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్ చేజ్లో శంకర్లాల్ స్వామి (సర్వీసెస్) స్వర్ణం నెగ్గాడు. పురుషుల 35 కిలోమీటర్ల రేస్ వాక్లో రాంబాబో (యూపీ) స్వర్ణం, సాగర్ సతీష్ చంద్రజోషి (గుజరాత్) రజతం, సురేందర్ సింగ్ (పంజాబ్) కాంస్యం గెలుపొందారు. మహిళల 35 కి.మీ రేస్ వాక్లో రమణ్దీప్ కౌర్ (పంజాబ్) స్వర్ణం, సోనాల్ సుక్వాల్ (రాజస్థాన్) రజతం, మంజూ రాణి (యూపీ) కాంస్యం దక్కించుకొన్నారు.