చుక్కలను తాకుతున్న బంగారం, వెండి ధరలు

ABN , First Publish Date - 2020-08-06T22:58:58+05:30 IST

బంగారం వెండి ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. పసిడి మిడిసి పడుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో...

చుక్కలను తాకుతున్న బంగారం, వెండి ధరలు

హైదరాబాద్: బంగారం వెండి ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. పసిడి మిడిసి పడుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.58 వేలకు చేరుకుంది. బుధవారం ఒక్కరోజే 1000 రూపాయలకు పెరిగి రూ.57 వేల 820కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 930 రూపాయల పెరుగుదలతో రూ.53 వేల 10 రూపాయలకు ఎగబాకింది. వెండి ధర భారీగా పెరిగి రూ.71 వేల మైలు రాయిని దాటేసింది. ఒక్క రోజే రూ.6,450లకు ఎగబాకి రూ. 71,500లకు చేరుకుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల మందగమనం కోవిడ్ నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితే ఇటువంటి పరిస్థితికి కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Updated Date - 2020-08-06T22:58:58+05:30 IST