విమానం బాత్రూంలో బంగారం దాచిపెట్టి తీసుకొచ్చాడు!
ABN , First Publish Date - 2021-04-08T12:24:46+05:30 IST
శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది.
హైదరాబాద్/శంషాబాద్ రూరల్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. బుధవారం దుబాయ్ నుంచి కొచ్చిన్ వయా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడు అక్రమంగా 1.2 కేజీల బంగారాన్ని తరలిస్తుండగా ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. నిందితుడు విమానంలోని బాత్రూంలో బంగారం దాచిపెట్టి తీసుకొచ్చాడని, దాని విలువ దాదాపు రూ. 60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.