కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

ABN , First Publish Date - 2022-08-08T15:34:22+05:30 IST

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.

కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి  నీటిమట్టం

జయశంకర్ భూపాలపల్లి: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం (Kaleshwaram) వద్ద గోదావరి  నీటిమట్టం పెరుగుతోంది. పుష్కర ఘాట్ వద్ద 10.290 మీటర్ల ఎత్తులో  గోదావరి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 4,58,910 క్యూసెక్కులుగా ఉంది. అలాగే సరస్వతి బ్యారేజ్ 66 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇన్ ప్లో, ఔట్ ప్లో 1,94,075 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2022-08-08T15:34:22+05:30 IST