స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిసిన గోవా శాసన సభ స్పీకర్

ABN , First Publish Date - 2021-11-23T00:49:37+05:30 IST

గోవా శాసనసభ స్పీకర్ రాజేష్ పట్నేకర్ నేతృత్వంలోని ఆరుగురు మాజీ శాసనసభ్యులు, అధికారుల నేతృత్వంలోని సభ్యుల బృందం సోమవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది

స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిసిన గోవా శాసన సభ స్పీకర్

హైదరాబాద్: గోవా శాసనసభ స్పీకర్ రాజేష్ పట్నేకర్ నేతృత్వంలోని ఆరుగురు మాజీ శాసనసభ్యులు, అధికారుల నేతృత్వంలోని సభ్యుల బృందం సోమవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది.అధికారిక స్టడీ టూర్ లో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన గోవా బృందం ముందుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డిని ఆయన  అధికారిక నివాసంలో భేటీ అయ్యింది. ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ పనితీరును, ప్రత్యేకతలను స్పీకర్ పోచారం గోవా బృందానికి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-11-23T00:49:37+05:30 IST