ఘనత మాది... గొప్పలు మీవి
ABN , First Publish Date - 2020-11-30T09:33:18+05:30 IST
‘టీడీపీ హయాం లో జరిగిన అభివృద్ధి, పురోగతికి సంబంధించి ఇండియాటుడే ర్యాంకులు ప్రకటించింది. కానీ వైసీపీ ప్రభుత్వం
ఇండియా టుడే ర్యాంకులు ఏ కాలానివో తెలుసుకోండి: కొమ్మారెడ్డి
అమరావతి/ఉంగుటూరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘‘టీడీపీ హయాం లో జరిగిన అభివృద్ధి, పురోగతికి సంబంధించి ఇండియాటుడే ర్యాంకులు ప్రకటించింది. కానీ వైసీపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా అవి తమకే వచ్చాయని గొప్పలు చెప్పుకొంటోంది. ఆ ర్యాంకులు ఏ కాలానికి వచ్చాయో సీఎం జగన్ తెలుసుకోవాలి’’ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడారు. గత ఐదేళ్ల పాలనను ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు ఇండియా టుడే స్పష్టంగా చెప్పాక కూడా ‘ఇది జగనన్న సాధించిన ఘనత’ అంటూ ఎలా చెప్పుకొంటా రో వారికే తెలియాలని పట్టాభి ఎద్దేవా చేశారు. కాగా, రాష్ట్రంలో వర్షాలకు పంట దెబ్బతిన్న ప్రతి రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నాచుగుంటలో పడిపోయిన వరి చేలను పరిశీలించారు.