కేసీ కెనాల్‌లో పడి ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-08-09T22:42:31+05:30 IST

జిల్లా పరిధిలోని కేసీ కెనాల్‌లో పడి ఇద్దరు మృతి చెందారు. రాజుపాలెం మండలం వాసుదేవ

కేసీ కెనాల్‌లో పడి ఇద్దరి మృతి

కడప: జిల్లా పరిధిలోని కేసీ కెనాల్‌లో పడి ఇద్దరు మృతి చెందారు. రాజుపాలెం మండలం వాసుదేవపురంలో కేసీ కాల్వలో పడి ఇద్దరు బాలికలు మృత్యువాత పడ్డారు. మృతదేహాలను గ్రామస్థులు వెలికితీసారు. పశువుల మేత కోసం వెళ్లి కేసీ కాలువలో ప్రమాదవశావత్తు బాలికలు జారి పడ్డారు. మృతి చెందిన బాలికలను ఇరగం రెడ్డి రాధ (9), మల్లీశ్వరి (12)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-09T22:42:31+05:30 IST