వీడిన బాలిక మిస్సింగ్ మిస్టరీ
ABN , First Publish Date - 2022-01-04T21:40:47+05:30 IST
నగరంలోని ఆర్సీ పురంలో సంచలనం సృష్టించిన బాలిక
హైదరాబాద్: నగరంలోని ఆర్సీ పురంలో సంచలనం సృష్టించిన బాలిక మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఇంటి పక్కన ఉండే శ్రీకాంత్ అనే వ్యక్తి బాలికను తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. బాలిక మిస్ అయ్యాక శ్రీకాంత్ను పలుమార్లు పోలీసులు విచారించారు. అయితే విచారణలో బాలిక వివరాలను శ్రీకాంత్ వెల్లడించలేదు. దీంతో మరోసారి శ్రీకాంత్ను అదుపులోకి తమ స్టయిల్లో పోలీసులు విచారణ చేశారు. ఎట్టకేలకు బాలికను తానే తీసుకెళ్లినట్టు శ్రీకాంత్ ఒప్పుకున్నాడు. శ్రీకాంత్కు ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. బాలికకు శ్రీకాంత్ ఫోన్ కొని ఇచ్చాడు. అయితే బాలికను తీసుకెళ్లిన విషయం శ్రీకాంత్ భార్యకు సైతం తెలియదు. ఈ విషయం తెలియడంతో శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.