పెళ్లి చేసుకుని.. ముఖం చాటేశాడు

ABN , First Publish Date - 2020-03-22T11:42:12+05:30 IST

ప్రేమించాడు.. రహస్యం గా పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు కాపురం చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో ఆ యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం

పెళ్లి చేసుకుని.. ముఖం చాటేశాడు

ప్రియుడి ఇంటి ఎదుట యువతి బైఠాయింపు

న్యాయం చేయాలని డిమాండ్‌ 

పెనుబల్లి, మార్చి 21: ప్రేమించాడు.. రహస్యం గా పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు కాపురం చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో  ఆ యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెలకుచెందిన మేరుగు శ్రీను అదే గ్రామానికి చెందిన వరలక్ష్మి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్రీను వరలక్ష్మిని లోబర్చుకున్నాడు. ఆమె ఒత్తిడితో రహస్యంగా వివాహం చేసుకున్నాడు.


ఆ తర్వాత  ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలియటంతో ఇద్దరినీ ఊరికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి శ్రీను వరలక్ష్మిని కలవడం మానేశాడు. పెళ్లి విషయం యువతి ఇంట్లో తెలియటంతో వారు శ్రీను కుటుంబసభ్యులను నిలదీశారు. ఈ వ్యవహారం పోలీ్‌సస్టేషన్‌కు చేరింది. దీంతో పోలీసులు  మరలా పెళ్లికి ఒప్పించారు. గత ఏడాది డిసెంబరు 22న  నిశ్చితా ర్థం కూడా జరిపారు. ఈనెల 19న పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేశారు. వరలక్ష్మిని పెళ్లి చేసుకోవద్దని శ్రీను కుటుంబసభ్యులు ఒత్తిడి చేయటంతో అతడు ఈనెల 9న పురుగుమందు తాగగా, వరలక్ష్మి ఈనెల 11న నిద్రమాత్రలు వేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చికిత్స తర్వాత క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి కోసం గ్రామపెద్దలు చేసిన రాజీ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వరలక్ష్మి శనివారం శ్రీను ఇంటి ఎదుట ధర్నాకు దిగింది.

Updated Date - 2020-03-22T11:42:12+05:30 IST