75 ఏళ్ల వయసులో పతకం..
ABN , First Publish Date - 2022-08-06T10:04:46+05:30 IST
స్వాట్లాండ్కు చెందిన 75 ఏళ్ల జార్జ్ మిల్లర్.. కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించి చరిత్ర సృష్టించాడు.
బర్మింగ్హామ్: స్వాట్లాండ్కు చెందిన 75 ఏళ్ల జార్జ్ మిల్లర్.. కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. లాన్ బౌల్స్ మిక్స్డ్ పెయిర్ విభాగంలో మెలానీ ఇన్నె్సతో కలిసి జార్జ్ ఫైనల్లో 16-9తో వేల్స్ జోడీని ఓడించి స్వర్ణం సాధించాడు. దీంతో టోర్నీ చరిత్రలో అత్యధిక వయసులో పతకం నెగ్గిన ప్లేయర్గా జార్జ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.