వైద్యులపై దాడికి ఉద్యోగ జేఏసీ ఖండన
ABN , First Publish Date - 2020-04-03T07:20:42+05:30 IST
గాంధీ ఆస్పత్రిలో వైద్యసిబ్బందిపై జరిగిన దాడిని తెలంగాణ జేఏసీ తీవ్రంగా ఖండించింది. కుటుంబాలకు దూరంగా ఉంటూ 24 గంటలూ పనిచేస్తున్న సిబ్బందిపై దాడిని హేయమైన...
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో వైద్యసిబ్బందిపై జరిగిన దాడిని తెలంగాణ జేఏసీ తీవ్రంగా ఖండించింది. కుటుంబాలకు దూరంగా ఉంటూ 24 గంటలూ పనిచేస్తున్న సిబ్బందిపై దాడిని హేయమైన చర్యగా జేఏసీ చైర్మన్ కె.రవీందర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ వి.మమత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దోషులపై చర్యలు తీసుకొని, దాడులు పునరావృత్తం కాకుండా చూడాలన్నారు. నిజామాబాద్లో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు.