అవంతి ఫిర్యాదు చేసే సరికే హేమంత్‌ను చంపేశారు: గచ్చిబౌలి సీఐ

ABN , First Publish Date - 2020-09-25T17:36:17+05:30 IST

హైదరాబాద్: హేమంత్‌ హత్యకేసులో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసులు వెంటనే స్పందించలేదని..

అవంతి ఫిర్యాదు చేసే సరికే హేమంత్‌ను చంపేశారు: గచ్చిబౌలి సీఐ

హైదరాబాద్: హేమంత్‌ హత్యకేసులో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసులు వెంటనే స్పందించలేదని హేమంత్ భార్య అవంతి ఆరోపిస్తోంది. కాగా.. హేమంత్ హత్యపై గచ్చిబౌలి సీఐ మాట్లాడుతూ.. నిన్న సాయంత్రం 4 గంటలకు హేమంత్‌, అవంతిని తీసుకెళ్లారని వెల్లడించారు. హేమంత్‌ తండ్రి 100కు డయల్‌ చేశారన్నారు. పెట్రోలింగ్‌ వాహనం వెళ్లేసరికి అక్కడ అవంతి లేదన్నారు. తమకు సాయంత్రం 6:30 గంటలకు అవంతి ఫిర్యాదు చేసిందని గచ్చిబౌలి సీఐ తెలిపారు. అవంతి ఫిర్యాదు చేసేసరికే హేమంత్‌ను చంపేశారన్నారు. ఈ హత్య కేసులో పోలీసుల అలసత్వం ఏమీ లేదన్నారు. హత్యకు అవంతి తండ్రి ధర్మారెడ్డి, బంధువులదే బాధ్యత అన్నారు. ఒకరిద్దరు మాత్రమే బయటివారున్నారని గచ్చిబౌలి సీఐ తెలిపారు.

Updated Date - 2020-09-25T17:36:17+05:30 IST