జూన్ నెల పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలి: కారం రవీందర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-06-07T00:22:48+05:30 IST

జూన్ నెల పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి కోరారు. ఉద్యోగులకు ఆఫీసుల్లో రక్షణ కల్పించాలని, రూ.50 లక్షల బీమా కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జూన్ నెల పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలి: కారం రవీందర్‌రెడ్డి

హైదరాబాద్: జూన్ నెల పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి కోరారు. ఉద్యోగులకు ఆఫీసుల్లో రక్షణ కల్పించాలని, రూ.50 లక్షల బీమా కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ, ఐఆర్, వయోపరిమితి పెంపు నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. తెలంగాణ ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అన్ని రాజకీయ పార్టీలకు తాము సమదూరం ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ అవసరాల మేరకు పదవీ విరమణ పెంచితే తమ అంటగట్టడం సరికాదని, పదవీ విరమణపై అందరికీ ఒకే విధానం ఉండాలని రవీందర్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2020-06-07T00:22:48+05:30 IST