పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ పెంపు

ABN , First Publish Date - 2022-03-23T12:51:49+05:30 IST

దేశంలో పెట్రో బాదుడు రెండో రోజు కూడా కొనసాగింది....

పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ పెంపు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రో బాదుడు రెండో రోజు కూడా కొనసాగింది. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్రం పెట్రో ధరలు పెంచి ప్రజలపై భారం మోపింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్రం రెండో రోజు కూడా పెట్రో ధరలు పెంచింది.బుధవారం తాజాగా పెట్రోల్, డీజిల్ లీటరుపై 80 పైసలు పెంచారు.దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పెట్రోల్ లీటరు ధర 97.01కు పెరిగింది. అలాగే డీజిల్ లీటరు ధర రూ.88.27కు చేరింది. వాణిజ్య రాజధాని నగరమైన ముంబైలో దేశంలోనే అత్యధికంగా పెట్రోలు ధర లీటరుకు రూ.111.58కు చేరింది. డీజిల్ లీటరు ధర రూ.95.74కు పెరిగింది. చెన్నై, కోల్ కతా, హైదరాబాద్ నగరాలతో పాటు దేశవ్యాప్తంగా రాష్ట్రాలు,నగరాలు, రవాణ చార్జీలను బట్టి పెట్రో ధరలు పెరిగాయి. దీనివల్ల ప్రజలపై అదనపు భారం పడుతోంది. 


Updated Date - 2022-03-23T12:51:49+05:30 IST