తమిళనాడుకు చెందిన మాజీ ఫుట్బాలర్ కన్నుమూత
ABN , First Publish Date - 2020-05-24T00:26:00+05:30 IST
తమిళనాడుకు చెందిన మాజీ ఫుట్బాలర్, కోచ్ ఆర్.శణ్ముగం(77) ఆనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయనకి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.
తమిళనాడుకు చెందిన మాజీ ఫుట్బాలర్, కోచ్ ఆర్.శణ్ముగం(77) ఆనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయనకి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. 1943లో బర్మాలో జన్మించిన ఆయన 1966-67ల్లో బర్మా జూనియర్, సీనియర్ జట్ల తరఫున ఆడారు. ఆ తర్వాత 1969లో జరిగిన సంతోష్ ట్రోఫీలో ఆయన ఇండియన్ రైల్వేస్ జట్టుకు, 1970లో జరిగిన జలంధర్ నేషనల్స్లో తమిళనాడు తరఫున ఆడారు.
ఆ తర్వాత 1969 నుంచి 1977 వరకూ ఆయన చెన్నై ఫుట్బాల్ అసోసియేషన్ లీగ్లో పాల్గొన్నారు. 1975-1976లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, బ్రెజిలియన్ ఫుట్బాల్ అకాడమీ నుంచి ఆయన కోచింగ్లో డిప్లొమా తీసుకున్నారు. ఆ తర్వాత ఐసీఎఫ్, తమిళనాడు, ఇండియన్స్ రైల్వేస్ జట్లకు కోచ్గా వ్యవహరించారు. దీంతో పాటు చెన్నైలోని ఫుట్బాల్ కోచెస్ అసోసియేషన్కి ఆయన అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించారు.