వినయశీలి.. విరాట్
ABN , First Publish Date - 2020-04-02T09:55:45+05:30 IST
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో వినయ విధేయతలున్న ఆట గాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ ప్రశంసించాడు. క్రికెట్ను ఎంతగానో ప్రేమించే ...
కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో వినయ విధేయతలున్న ఆట గాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ ప్రశంసించాడు. క్రికెట్ను ఎంతగానో ప్రేమించే విరాట్ తన సహచర ఆటగాళ్లను చాలా గౌరవిస్తాడని పేర్కొన్నాడు. అలాగే బ్యాటింగ్లో అతడి నిలకడ తననెంతో ఆకట్టుకుంటుందని చెప్పాడు. ‘తాను అనుకున్నప్పుడల్లా పరుగులు సాధించగల సామర్థ్యం కోహ్లీ సొంతం. ఇక విరాట్ అణకువ కలిగిన క్రికెటర్. ప్రత్యర్థి జట్టుతోనూ అతడు స్నేహపూర్వకంగా ఉంటాడు. విరాట్ స్థాయి క్రికెట్ ఆడిన ఆటగాడిగా నేను ఇది చెబుతున్నా. భారత ఆటగాళ్లు దూకుడుగా ఉం టారని అంటారు. మైదానంలో దూకుడుగా ఉండాల్సిందే. కానీ దానికీ పరిమితులున్నాయి’ అని మియాందాద్ చెప్పుకొచ్చాడు.