కక్ష సాధింపులో భాగంగానే నా కుమారుడిపై కేసు: పితాని

ABN , First Publish Date - 2020-07-10T20:17:36+05:30 IST

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈఎస్ఐ స్కామ్‌లో తన కుమారుడు వెంకట సురేష్‌పై కేసు నమోదు చేశారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ

కక్ష సాధింపులో భాగంగానే నా కుమారుడిపై కేసు: పితాని

ఏలూరు: రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈఎస్ఐ స్కామ్‌లో తన కుమారుడు వెంకట సురేష్‌పై కేసు నమోదు చేశారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. ‘‘నన్ను ఏమీ చేయలేక ముద్దాయిలను బెదిరించి తన కుమారుని కేసులో ఇరికించారు. అందుకే హైకోర్టును ఆశ్రయించాం. అలా ఆశ్రయించడంలో తప్పులేదు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపే. రాజకీయాల్లో పైరవీలు సర్వసాధారణం.’’ అని పితాని అన్నారు.

Updated Date - 2020-07-10T20:17:36+05:30 IST