వైసీపీ రంగులపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: మాణిక్యాలరావు

ABN , First Publish Date - 2020-06-03T18:47:42+05:30 IST

వైసీపీ రంగులపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: మాణిక్యాలరావు

వైసీపీ రంగులపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: మాణిక్యాలరావు

ఏలూరు: ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు తొలగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని  మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ  రంగులు తొలగించడానికి అయ్యే ఖర్చుతో పాటు మళ్ళీ వేయడానికి అయ్యే ఖర్చును వైసీపీ పార్టీ నిధుల నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ శ్రేణులకు న్యాయ వ్యవస్థపై గౌరవం లేదనేది చాలా చిన్న మాటన్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్నవారికి కులాలు, మతాలను ఆపాదిస్తూ... వారిని అవహేళన చేసేలా వ్యవహరిస్తున్నారని మాణిక్యాలరావు మండిపడ్డారు. 

Updated Date - 2020-06-03T18:47:42+05:30 IST