జగన్‌కు కేసుల భయం పట్టుకుంది: కాల్వ

ABN , First Publish Date - 2020-10-30T18:23:42+05:30 IST

సీఎం జగన్‌కు కేసుల భయం పట్టుకుందని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్ర సీఎంగా కేంద్రాన్ని నిలదీసి పోలవరం నిధులు రాబట్టాలని కోరారు. వైసీపీ పార్లమెంటు సభ్యులు కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారని

జగన్‌కు కేసుల భయం పట్టుకుంది: కాల్వ

అనంతపురం: సీఎం జగన్‌కు కేసుల భయం పట్టుకుందని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్ర సీఎంగా కేంద్రాన్ని నిలదీసి పోలవరం నిధులు రాబట్టాలని కోరారు.  వైసీపీ పార్లమెంటు సభ్యులు కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారని అడిగారు. పోలవరం ప్రాజెక్టుపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.  వైసీపీ నేతల కుట్రలు పోలవరానికి శాపంగా మారాయన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాల వల్లే అంచనాల వ్యయం పెరిగిందని తెలిపారు. పోలవరం ఆగిపోతే రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. 

Updated Date - 2020-10-30T18:23:42+05:30 IST