ఏబీఎన్‌పై కక్ష సాధింపుకు పరాకాష్ట రాధాకృష్ణపై కేసు: Jawahar

ABN , First Publish Date - 2021-12-13T17:52:53+05:30 IST

ప్రజాస్వామ్యాన్ని కాపాడే పత్రిక రంగంపై ప్రభుత్వ దమనకాండ సరైంది కాదని మాజీ మంత్రి జవహర్ అన్నారు.

ఏబీఎన్‌పై కక్ష సాధింపుకు పరాకాష్ట రాధాకృష్ణపై కేసు: Jawahar

అమరావతి: ప్రజాస్వామ్యాన్ని కాపాడే పత్రిక రంగంపై ప్రభుత్వ దమనకాండ సరైంది కాదని మాజీ మంత్రి జవహర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ మొదటి నుండి ప్రశ్నించే చానల్స్‌ను నిలువరించే ప్రయత్నం జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏబీఎన్‌పై కక్ష సాధింపుకు పరాకాష్ట రాధాకృష్ణపై కేసు అని అన్నారు. భయపెట్టి లొంగ దీసుకోవలనేదే జగన్ నైజమన్నారు. జీరో ఎఫ్‌ఐఆర్ సామాన్యుడి ఆయుధం దానిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో నిజాన్ని భయపెట్టలేరని జవహర్ అన్నారు. 

Updated Date - 2021-12-13T17:52:53+05:30 IST