ప్రధానికి జగన్ లేఖ రాయడం కంటితుడుపు చర్యే: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-11-01T00:59:39+05:30 IST
పోలవరంపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాయడం కంటితుడుపు చర్యేనని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ‘కేసుల కోసం ఢిల్లీ వెళ్లే జగన్కు పోలవరం బాధితుల కోసం ప్రధానిని కలిసే తీరిక లేదా? పోలవరం నిర్వాసితులపై జగన్
అమరావతి: పోలవరంపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాయడం కంటితుడుపు చర్యేనని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ‘కేసుల కోసం ఢిల్లీ వెళ్లే జగన్కు పోలవరం బాధితుల కోసం ప్రధానిని కలిసే తీరిక లేదా? పోలవరం నిర్వాసితులపై జగన్ ప్రేమ ఏపాటిదో తెలుస్తోంది. సీబీఐ, ఈడీ కేసులకు వెచ్చిస్తున్న సమయంలో కొంతైనా జగన్.. భూ నిర్వాసితుల కోసం కేటాయించాలి. పబ్జీ, క్రికెట్ బెట్టింగులు తప్ప జగన్కు నిర్వాసితుల సమస్యలు పట్టవా?’ అని ప్రశ్నించారు.