పనికి హక్కు కల్పించాలని రాజ్యాంగంలో ఉంది: లక్ష్మీనారాయణ

ABN , First Publish Date - 2021-12-24T21:56:53+05:30 IST

పనికి హక్కు కల్పించాలని రాజ్యాంగంలో ఉందని మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

పనికి హక్కు కల్పించాలని రాజ్యాంగంలో ఉంది: లక్ష్మీనారాయణ

అమరావతి: పనికి హక్కు కల్పించాలని రాజ్యాంగంలో ఉందని మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఉపాధి హక్కు మనిషికి జీవించే హక్కులో భాగమని రాజ్యాంగంలో ఉందన్నారు. విద్యావ్యవస్థలో మార్పు రావాలని, అప్పుడే విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుందని చెప్పారు. చదువు పూర్తయిన వారిలో 15 శాతం మందికి ఉద్యోగం దొరుకుతుందన్నారు. దేశంలో ఎన్ని పథకాలు ఉన్నా ఆచరణలో సమస్య ఉందన్నారు.రూరల్ కంటే అర్బన్‌లో ఆత్మహత్యలు ఎక్కువగా అవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు ఉపాధి కల్పించకపోవడంతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.పిల్లలు కోరుకునే ఉద్యోగాలకు తల్లిదండ్రులు అవకాశం కల్పించాలని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-12-24T21:56:53+05:30 IST