‘ముంబై’ సారథి రోహిత్‌ శర్మ నిద్రలేని రాత్రులు మిగిల్చాడు..

ABN , First Publish Date - 2022-03-11T08:55:12+05:30 IST

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ అంటే ముం దురోజు రాత్రి తనకు నిద్ర పట్టేది కాదని ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మాజీ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ చెప్పాడు.

‘ముంబై’ సారథి రోహిత్‌ శర్మ నిద్రలేని రాత్రులు మిగిల్చాడు..

న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ అంటే ముం దురోజు రాత్రి తనకు నిద్ర పట్టేది కాదని ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మాజీ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ చెప్పాడు. ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మే అందుకు కారణమని వివరించాడు. ‘డివిల్లీర్స్‌, గేల్‌ లేదా మరో ఆటగాడుకాదు.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ నాకు ఐపీఎల్‌లో ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ అంటే రోహిత్‌ను ఎలా ఎదుర్కోవాలో అనే ఆందోళన నాకు ఉండేది. ఐపీఎల్‌ చరిత్రలో సారథిగా రోహిత్‌ శర్మవలే విజయవంతం అయిన క్రికెటర్‌ మరొకరు లేరు’ అని ఓ క్రీడా చానెల్‌ కార్యక్రమంలో గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. 

Updated Date - 2022-03-11T08:55:12+05:30 IST