కేబీఆర్ పార్క్ లో ప్రపంచ అటవీ దినోత్సవాలు

ABN , First Publish Date - 2022-03-22T00:54:31+05:30 IST

ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా నగరంలోని కేబీర్ పార్క్ లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ పి.నవీన్ రావు, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కేబీఆర్ పార్క్ లో ప్రపంచ అటవీ దినోత్సవాలు

హైదరాబాద్: ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా నగరంలోని కేబీర్ పార్క్ లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ పి.నవీన్ రావు, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా చీఫ్ జస్టిస్ కేబీఆర్ లో మర్రి మొక్కను నాటారు. అలాగే జస్టిస్ నవీన్ రావు నేరేడు మొక్కను నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ వేప మొక్కను నాటారు. తెలంగాణకు హరితహారం ద్వారా జంగిల్ బచావో- జంగిల్ బడావో నినాదంతో చేపట్టిన కార్యక్రమాలను అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ చీఫ్ జస్టిస్ కు వివరించారు. అనంతరం సీజే ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అనంతరం కొద్దిసేపు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పార్క్ లో వాకింగ్ చేశారు.


ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు చాలా బాగున్నాయని ఈసందర్భంగా చీఫ్ జస్టిస్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి విరివిగా మొక్కలు నాటడమే మార్గమని అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరూ త్రీ పీ అంటే పార్టిసిపేట్, ప్లాంట్, ప్రొటక్ట్ లను విధిగా అనుసరించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ హితం కోసం తీసుకుంటున్న కార్యక్రమాల్లో అందరి భాగస్వామ్యం ఉండాలని అన్నారు. 

Updated Date - 2022-03-22T00:54:31+05:30 IST