సిద్దిపేట గురుకులంలో ఆహార కల్తీ: గీతారెడ్డి
ABN , First Publish Date - 2022-06-30T09:42:05+05:30 IST
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట మైనార్టీ గురుకులంలో ఆహార కల్తీ జరిగి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఈ విషయాన్ని బయటపడకుండా దాచారని
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట మైనార్టీ గురుకులంలో ఆహార కల్తీ జరిగి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఈ విషయాన్ని బయటపడకుండా దాచారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి ఆరోపించారు. పవర్ఫుల్ మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలో ఈ ఘటన జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.