Air India Express కీలక ప్రకటన.. Kuwait నుంచి భారత్‌లోని ఈ నగరాలకు టికెట్ బుకింగ్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-09-03T13:38:59+05:30 IST

కువైత్ నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల కోసం టికెట్ బుకింగ్స్ ప్రారంభించినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గురువారం ట్విటర్ ద్వారా ప్రకటించింది.

Air India Express కీలక ప్రకటన.. Kuwait నుంచి భారత్‌లోని ఈ నగరాలకు టికెట్ బుకింగ్ ప్రారంభం

కువైత్ సిటీ: కువైత్ నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల కోసం టికెట్ బుకింగ్స్ ప్రారంభించినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గురువారం ట్విటర్ ద్వారా ప్రకటించింది. సెప్టెంబర్ నెల కోసం ఈ బుకింగ్స్ ఓపెన్ చేసినట్లు ట్వీట్ చేసింది. కువైత్ నుంచి భారత్‌లోని విజయవాడ, కోజికోడ్, కొచ్చి, మంగళూరు, కన్నూర్, తిరుచిరాపల్లికు(త్రిచీ) విమానాలు నడపనున్నట్లు పేర్కొంది. అలాగే ఏ రోజుల్లో ఈ విమాన సర్వీసులు ఉంటాయో కూడా వివరంగా తెలియజేసింది. ఆ వివరాలను మనం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ట్వీట్‌లో చూడొచ్చు. 


కువైత్ నుంచి విజయవాడ, కోజికోడ్‌కు ప్రతి బుధవారం IX 594 విమాన సర్వీసు ఉంటుంది. అలాగే ప్రతి సోమ, శుక్రవారం IX 394 ఉంటుంది. 

కువైత్ నుంచి త్రిచీ, కొచ్చికు ప్రతి గురువారం IX 494 సర్వీస్ నడపనుంది.

కువైత్ టు మంగళూరు, త్రిచీకు ప్రతి శనివారం IX 290 సర్వీస్ ఉంటుంది.

అలాగే కువైత్ నుంచి కన్నూర్, త్రిచీకు ప్రతి మంగళవారం IX 594 విమాన సర్వీస్ నడపనుంది. కాగా, టికెట్ ధరల వివరాలను మాత్రం వెల్లడించలేదు. అటు కువైత్‌కు చెందిన జజీరా ఎయిర్‌వేస్ కూడా భారత్ నుంచి కువైత్‌కు నడపనున్న డైరెక్ట్ విమాన సర్వీసులకు సంబంధించిన టికెట్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది.  

Updated Date - 2021-09-03T13:38:59+05:30 IST