floods: వరద సాయంపై చేతులెత్తేసిన జగన్

ABN , First Publish Date - 2022-07-27T22:54:01+05:30 IST

వరద బాధితుల (Flood victims) సహాయంపై సీఎం జగన్ (CM Jagan) చేతులెత్తేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు.

floods: వరద సాయంపై చేతులెత్తేసిన జగన్

ఏలూరు: వరద బాధితుల (Flood victims) సహాయంపై సీఎం జగన్ (CM Jagan) చేతులెత్తేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులతో కేంద్రం ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం తరపున వరదసాయం అందించగలమని చెప్పారు. 500 కోట్లు, వెయ్యి కోట్లు అయితే తన చేతిలో ఉంటుందని, కేంద్రం నిధులు ఇస్తేనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ (R&R package) అమలు చేయగలమని తెలిపారు. రూ. 20 వేల కోట్లు అంటే తన చేతిలో ఎక్కడ ఉంటుంది? అని ప్రశ్నించారు. వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి... ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతామని పేర్కొన్నారు. స్వయంగా ప్రధాని మోదీ (Prime Minister Modi)ని కలిసి సమస్యలు వివరిస్తానని ప్రకటించారు. వరద బాధితులు తమను తిట్టుకుంటున్నారని కూడా ప్రధానికి చెబుతానని చెప్పారు. త్వరగా ఆర్థిక సాయం అందించాలని మోదీకి విజ్ఞప్తి చేస్తానని ప్రకటించారు. బాధితులకు సాయం ఎప్పటికైనా ఇవ్వక తప్పదు కదా అని వైరాగ్యంతో మాట్లాడారు. సాయం త్వరగా అందిస్తే అంతా సంతోషపడతారని ప్రధానికి చెబుతానని సీఎం వివరించారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ అడిగానని, పరిహారం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. పరిహారం ఇస్తేనే ప్రాజెక్టుల్లో నీళ్లు నింపుతామని, సెప్టెంబర్‌ నాటికి పరిహారం, పునరావాసం కల్పిస్తామని జగన్‌ హామీ పడ్డారు.


గోదావరి వరదల కారణంగా వాటిల్లిన పంట నష్టాలు, ఇతర ఆస్తి నష్టాలను మదింపుచేసి ఈ సీజన్లోనే మూడు నెలల్లోపే రైతులందరికీ ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తానని జగన్ ప్రకటించారు. మూడు నెలల్లో అన్ని నష్టపరిహారాలూ చెల్లిస్తామన్నారు. మంగళవారం కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడిలోని ఊడుమూడిలంక, జి.పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిపేటల్లోని వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వశిష్ఠ నదీపాయలో పంటుపై ప్రయాణించి లంక గ్రామాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు.


Updated Date - 2022-07-27T22:54:01+05:30 IST