ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ కార్నివాల్

ABN , First Publish Date - 2021-03-08T23:23:50+05:30 IST

స్మార్ట్‌ఫోన్లకు మారాలనుకునే వారికి, కొత్త మోడళ్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది శుభవార్తే. ప్రముఖ ఈ-కామర్స్

ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ కార్నివాల్

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్లకు మారాలనుకునే వారికి, కొత్త మోడళ్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది శుభవార్తే. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ నేడు స్మార్ట్‌ఫోన్ కార్నివాల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై డీల్స్, డిస్కౌంట్స్ లభించనున్నాయి. ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎక్స్ఆర్, రియల్‌మి సి12, పోకో సి3, రియల్‌మి నర్జో 30ఎ తదితర ఫోన్లపై ధరల తగ్గింపు ప్రకటించింది. యాక్సిస్ బ్యాంకుతో జట్టు కట్టిన ఫ్లిప్‌కార్ట్ డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ. 1,250 వరకు తక్షణ రాయితీ ప్రకటించింది. ఇది కాకుండా, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్, ఎక్స్‌‌చేంజ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. 


ఇప్పటికే ప్రారంభమైన ఈ స్మార్ట్‌ఫోన్ కార్నివాల్ ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ ఎస్ఈ (2020) 64 జీబీ మోడల్, 128 జీబీ ఆప్షన్ ధరను రూ.34,999 నుంచి రూ. 29,999కి తగ్గించింది. ఐఫోన్ ఎక్స్ఆర్ 64జీబీ స్టోరేజీ ఆప్షన్ ధరను రూ. 45,984 నుంచి రూ.38,999కి తగ్గించగా, 128 జీబీ మోడల్ ధరను రూ. 43,999కి లిస్ట్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ పై రూ. 5 వేలు రాయితీ ప్రకటించింది. పాత ఫోన్ల ఎక్స్‌చేంజ్‌పై ఫ్లిప్‌కార్ట్ అదనంగా రూ. 7 వేల రాయితీ ఇస్తోంది. రెడ్‌మి 9 ప్రొ మ్యాక్స్‌పై రూ. 2 వేలు తగ్గించింది. ఫలితంగా రూ. 14,999 నుంచి అందుబాటులో ఉంది. 


మోటో జి 5జిని రూ. 21,200కు లిస్ట్ చేసిన ఫ్లిప్‌కార్ట్ పాత ఫోన్ ఎక్స్‌చేంజ్‌పై అదనంగా రూ. 2 వేల రాయితీ కూడా ఇస్తోంది. ఐక్యూ 3ని రూ. 24,990కి విక్రయానికి పెట్టింది. నెలకు రూ. 4,998తో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఆఫర్ చేస్తోంది. 


స్మార్ట్‌ఫోన్ కార్నివాల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41పై ఫ్లిప్‌కార్ట్ రూ. 1500 రాయితీ ప్రకటించింది. ఈ ఫోన్ 64 జీబీ మోడల్ ధర రూ. 15,999గా పేర్కొనగా, రూ. 128 జీబీ మోడల్‌ను రూ. 16,4999కి జాబితా చేసింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్‌మి సి12 3జీబీ ర్యామ్+32 జీబీ వేరియంట్‌పై రూ. 500 రాయితీ ప్రకటించి రూ.8,4999కి అందుబాటులో ఉంచింది. 

Updated Date - 2021-03-08T23:23:50+05:30 IST