వందే భారత్ మిషన్: కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం!

ABN , First Publish Date - 2020-08-09T01:08:10+05:30 IST

‘వందే భారత్ మిషన్’కొనసాగింపుపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ అంశంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటనను వి

వందే భారత్ మిషన్: కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం!

న్యూఢిల్లీ: ‘వందే భారత్ మిషన్’కొనసాగింపుపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ అంశంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ‘వందే భారత్ మిషన్‌’లో భాగంగా దుబాయిలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తున్న ఎయిర్ ఇండియా విమానం కేరళలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.  ఈ ఘటనలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ మిషన్‌ను కొనసాగిస్తుందో.. లేదో.. అని విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. ‘వందే భారత్ మిషన్’ను యథావిధిగా కొనసాగించనున్నట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ఇదిలా ఉంటే.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ను మే 7న ప్రారంభించింది. ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 9.5లక్షల మంది భారతీయులు ఇండియాకు చేరుకున్నారు. 


Updated Date - 2020-08-09T01:08:10+05:30 IST